అద్వానీకి మళ్లీ ములాయం ప్రశంస: కాంగ్రెస్పై 'సిబిఐ'
ఇందులో అద్వానీ మాట్లాడుతూ... లోహియా, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అఖండ భారత్ భావనతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. ఈ సంద్రభంగా లోహియాను ప్రశంసించారు. ఈ విషయాన్ని లక్నోలో ములాయం సింగ్ వద్ద ప్రస్తావించగా... లోహియాను అద్వానీ ప్రశంసించి ఉంటే, అది మంచిదే కదా అన్నారు. మంచి నాయకుడిని కీర్తించాలని, తాను అద్వానీని ప్రశంసిస్తే అందరూ రాద్దాంతం చేశారని, మంచి చేసిన వారిని, చేస్తున్న వారిని అభినందించాల్సిందే అన్నారు. అంతేగానీ, వారిని కించపర్చాలా అని ప్రశ్నించారు.
అదే సమయంలో కాంగ్రెసుతో పోరాడితే జైలుకేనని ములాయం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసు కష్టాల్లో ఉన్నప్పుడు తాము మద్దతిచ్చామని, ఆ తర్వాత తన పైకి సిబిఐని ఉసిగొల్పారని ఆరోపించారు. కాంగ్రెసుకు వేయి చేతులు ఉంటాయని, వ్యతిరేకిస్తే సిబిఐని ప్రయోగిస్తుందని దాంతో పోరాడలేమన్నారు. ఆ పార్టీని ఓడించేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఇప్పటికైతే యుపిఏకు మద్దతు ఉపసంహరించనని చెప్పారు. లోకసభకు ఎప్పుడైనా ఎన్నికలు జరుగవచ్చునని అన్నారు.
ములాయంపై నోరు జారొద్దు
యూపిఏకు బయటి నుండి మద్దతిస్తున్న ములాయం సింగ్ యాదవ్ పైన విమర్శల దాడి ఆపాలని కేంద్రమంత్రి బేణి ప్రసాద్ వర్మకు కాంగ్రెసు సూచించింది. ఈ నేపథ్యంలో ఎస్పీ నుంచి తనపై దాడి ఎదురైతే తప్ప తాను అతనిని ఏమీ అనని బేణి నాయకత్వానికి హామీ ఇచ్చారట.