హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసలు అర్హుడు కాడు: బాలయ్యపై లక్ష్మీపార్వతి ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Laxmi Parvathi
హైదరాబాద్: నందమూరి హీరో బాలకృష్ణపై స్వర్గీయ ఎన్టీ రామరావు సతీమణి, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నేతలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఫోటో విషయంలో ఎన్టీఆర్ కుమారుడు, సినీ నటుడు బాలకృష్ణ మాట్లాడడం హాస్యాస్పదమని ఆమె శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

ఎన్టీఆర్ బతికుండగానే తెలుగుదేశం పార్టీ నాయకులు పదవిని లాక్కున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పేరు కూడా ఉచ్చరించే హక్కు వారికి లేదని ఆమె అన్నారు. బాలకృష్ణ ఆ విషయంలో అసలు అర్హుడు కాడని ఆమె అన్నారు. పదవిని లాక్కుని అవమానపరిచినప్పుడు బాలకృష్ణ బావ చంద్రబాబు పక్కనే నిలబడ్డారని ఆమె వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం పార్టీ దిక్కు తోచని పరిస్థితిలో పడిందని, అందుకే ఫొటో వివాదాన్ని తెరపైకి తెచ్చారని ఆమె అన్నారు. కొందరు అభిమానులు ఎవరైనా ఎన్టీఆర్ ఫొటోను వాడుకుంటే తప్పు లేదని ఆమె చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ ఫొటోతో కాకుండా చంద్రబాబు ఫొటోతో ప్రజల్లోకి వెళ్లాలని ఆమె సవాల్ చేశారు.

లక్ష్మీపార్వతి మొదటి నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. జగన్ చేపట్టిన ఆందోళనకార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. చంద్రబాబునే ప్రధాన ప్రత్యర్థిగా ఆమె ఎంచుకున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని ఎన్టీ రామారావుతో ఆమె పోల్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

English summary
NT Rama Rao wife and NTR Telugudesam party president Lakshmi Parvathi lashed out at Nandamuri hero and Telugudesam leader Balakrishna's comments on the usage of NTR image by YSR Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X