అసలు అర్హుడు కాడు: బాలయ్యపై లక్ష్మీపార్వతి ఫైర్
ఎన్టీఆర్ బతికుండగానే తెలుగుదేశం పార్టీ నాయకులు పదవిని లాక్కున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పేరు కూడా ఉచ్చరించే హక్కు వారికి లేదని ఆమె అన్నారు. బాలకృష్ణ ఆ విషయంలో అసలు అర్హుడు కాడని ఆమె అన్నారు. పదవిని లాక్కుని అవమానపరిచినప్పుడు బాలకృష్ణ బావ చంద్రబాబు పక్కనే నిలబడ్డారని ఆమె వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్టీ దిక్కు తోచని పరిస్థితిలో పడిందని, అందుకే ఫొటో వివాదాన్ని తెరపైకి తెచ్చారని ఆమె అన్నారు. కొందరు అభిమానులు ఎవరైనా ఎన్టీఆర్ ఫొటోను వాడుకుంటే తప్పు లేదని ఆమె చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ ఫొటోతో కాకుండా చంద్రబాబు ఫొటోతో ప్రజల్లోకి వెళ్లాలని ఆమె సవాల్ చేశారు.
లక్ష్మీపార్వతి మొదటి నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. జగన్ చేపట్టిన ఆందోళనకార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. చంద్రబాబునే ప్రధాన ప్రత్యర్థిగా ఆమె ఎంచుకున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని ఎన్టీ రామారావుతో ఆమె పోల్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.