హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మొండి ప్రేమికుడి వేధిపులు: అమ్మాయి ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rangareddy District
హైదరాబాద్: ఓ మొండి ప్రేమికుడి వేధింపులు తట్టుకోలేక ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. రంగారెడ్డి కొత్తపల్లికి చెందిన తుత్తురు జయమ్మ, జంగయ్య కుమార్తె అనూష(17) చేవెళ్లలోని వివేకనంద జూనియర్ కళాశాలలో ఇంటర్మిడియట్ రెండో సంవత్సరం పరీక్షలు రాసింది. ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటుంది.

నెల రోజులుగా అదే గ్రామానికి చెందిన వడ్ల శివకుమార్ తనను ప్రేమించాలంటూ ఫోన్ చేసి తరచూ వేధించేవాడు. శివకుమార్ ఫోన్ చేసి వేధిస్తున్నాడంటూ అనూష ఈ నెల 1వ తేదీన తల్లిదండ్రులకు తెలిపింది. అనూష తల్లిదండ్రులు శివకుమార్‌ను పిలిచి ఇది మంచి పద్దతి కాదని, తన కుమార్తె జోలికి వస్తే బాగుండదని మందలించారు.

శివకుమార్ తీరు ఏ మాత్రం మారలేదు. అతను అమ్మాయిని వేధించటం కొనసాగించాడు. గురువారం ఉదయం తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్లారు. అనూష ఇంట్లో ఎవరూ లేని చూసి ప్రేమ వేధింపులు భరించలేక జీవితంపై ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.

ఇంట్లో నుంచి మంటలు రావటంతో చుట్టుపక్కల వారు గమనించి తలుపులు తీసేలోపే తీవ్రంగా గాయపడి చనిపోయింది. ప్రేమ వేధింపులతోనే తన కుమార్తెను చనిపోయిందని శివకుమార్‌ను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎస్సై చైతన్యకుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A 17 years girl student committed suicide with harassment in the name of love on Sivakumar in Rangareddy district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X