వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీనగర్‌లో బ్రిటిష్ మహిళ మృతి: రేప్‌గా అనుమానం

By Pratap
|
Google Oneindia TeluguNews

Jammu Kashmir
శ్రీనగర్: శ్రీనగర్‌లో 24 ఏళ్ల బ్రిటిష్ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. జమ్మా కాశ్మీర్‌లోని దాల్ లేక్‌లో గల హౌస్ బోట్ లోపల బ్రిటిష్ మహిళ శవమై శనివారం కనిపించింది. రక్తం మడుగులో సారా ఎలిజబెత్ అనే బ్రిటిష్ మహిళ శవం రక్తం మడుగులో కనిపించింది.

ఆ మహిళ దుస్తులు చిరిగి ఉన్నాయని, దీన్ని బట్టి మహిళపై అత్యాచారం జరిగి ఉంటుందనే అనుమానం కలుగుతోందని, అత్యాచారం చేసిన తర్వాత ఆమెను చంపి ఉంటారని పోలీసులు అంటున్నారు. డేవిట్ రిచర్డ్ (43) డచ్ యాత్రికుడు హౌస్‌బోట్‌లోని మరో గదిలో ఉంటున్నాడు.

శ్రీనగర్ - జమ్మూ జాతీయ రహదారిపై శ్రీనగర్‌కు 75 కిలోమీటర్ల దూరంలో గల ఖాజీగండ్ మీదుగా పారిపోవడానికి ప్రయత్నించిన అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ బృందం సంఘటనా స్థలానికి వచ్చింది. మహిళ శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. విదేశీ మహిళలపై ఇటీవల వరుసగా అత్యాచారాలు జరుగుతన్న సంఘటనలు చోటు చేసుకోవడానికి తీవ్ర కలవరానికి గురి చేస్తోంది.

English summary
A 24-year-old British woman was on Saturday found murdered inside a houseboat in the Dal Lake here, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X