హేమ, మాధురిలపై సెక్సీయెస్ట్ వ్యాఖ్య: మంత్రి ఔట్
ఇటీవల మంత్రి రాజారామ్ పాండే ప్రతాప్గఢ్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాలోని రోడ్లను హేమ మాలిని, మాధురీ దీక్షిత్ల చెంపల వలె చేస్తానని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన తన మంత్రి పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చింది.
కాగా, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇప్పటికే తన వద్ద 61 డిపార్టుమెంటులను ఉంచుకున్నారు. పాండే రాజీనామాతో ఇప్పుడు కొతంతగా ఖాదీ, గ్రామోద్యోగ్ బాధ్యతలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. పాండే వ్యాఖ్యలపై పలు రాజకీయ పార్టీలు, సోషల్ ఆర్గనైజేషన్స్ భగ్గుమన్నాయి.
ఎన్నికలకంటే అందాల పోటీ కాదు: జైరామ్ రమేష్
రాబోయే సార్వత్రిక ఎన్నికలు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి మధ్య పోటీ అన్న వాదనను కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తోసిపుచ్చారు. ఎన్నికలంటే అందాల పోటీలు కాదన్నారు. భారత్లో ఎన్నికలు ఎప్పుడూ వ్యక్తుల మధ్య జరగవని, పార్టీలు పోటీ పడతాయని, ఎన్నికలంటే రాజకీయ పార్టీల మధ్య అందాల పోటీలు కాదని చెప్పారు. ఎన్నికలు షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాదే జరుగుతాయని తెలిపారు.