మావోలకి దెబ్బ: అగ్రనేత రాజిరెడ్డి సహా 10మంది మృతి

బీజాపూర్ సమీపంలోని బాసగూడ పోలీసు స్టేషన్ పరిధిలో ఇది జరిగింది. 150 మంది మావోయిస్టుల బెటాలియన్ సమావేశం నిర్వహిస్తుందనే సమాచారం రావడంతో గ్రేహౌండ్స్, సిఆర్పీఎఫ్, ఖమ్మం జిల్లా పోలీసులు, ఛత్తీస్గఢ్ పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహించారు. ఈ సమయంలో మావోలు ఎదురు పడ్డారు.
దీంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. టవర్తి, కుమ్మరితోపు వద్ద కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో దాదాపు పదిమంది మావోలు మృతి చెందినట్లుగా సమాచారం. ఇందులో మావోల అగ్రనేత మల్లా రాజిరెడ్డి కూడా ఉన్నట్లుగా సమాచారం. పోలీసులు భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు.
ఎన్కౌంటర్లో మృతి చెందినట్లుగా భావిస్తున్న రాజిరెడ్డిది కరీంనగర్ జిల్లాలోని మంథని మండలం శాస్త్రులపల్లి గ్రామం. ఆయన మంథని, మహదేవ్పూర్లకు నాయకత్వం వహించారు. ప్రస్తుతం అతను కేంద్ర కమిటీలోని ఐదుగురు వ్యక్తుల్లో ఒకరు. అందులోను రాజిరెడ్డి ముఖ్యుడు. అగ్రనేతలు గణపతి, మల్లోజుల, కిషన్జీ కంటే రాజిరెడ్డి సీనియర్. ఇతని వయస్సు 75 నుండి 80 వరకు ఉంటుంది.
2007లో అతను పోలీసులకు పట్టుబడ్డాడు. 2009 అక్టోబరులో బెయిల్ పైన విడుదలయ్యాడు. వెంటనే అతను అజ్ఞాతంలోకి వెళ్లాడు. అప్పుడే అతనిపై రూ.12 లక్షల రివార్డు ప్రకటించారు. 1975లో ఉద్యమ బాట పడ్డాడు. ఇంటర్ వరకు చదివిన రాజిరెడ్డి వ్యూహరచనలో నిపుణుడు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications