ఎత్తుకెళ్లి అమ్మాయిని ముగ్గురు రేప్ చేశారు

ఘటనలో ప్రధాన నిందితుడు ప్రదీప్ (28)ని పోలీసులు అరెస్టు చేశారు. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మరో ఇద్దరు నిందితులు రాహుల్ (23), అమిత్ (24) పరారీలో ఉన్నారు. న్యూఢిల్లీలోని అశోక్నగర్ పోలీసులు కిడ్నాప్, రేప్ కేసులు నమోదు చేశారు.
వివరాలు ఇలా ఉన్నాయి - అశోక్నగర్లోని దల్లాపురా కు చెందిన అమ్మాయి బుధవారం ఉదయం 7 గంటలకు పాఠశాలకు వెళ్తున్న సమయంలో నల్ల స్కార్పియోలో వచ్చిన వ్యక్తులు ఆమెను అడ్డగించారు. బాధితురాలికి ప్రదీప్ తెలుసు. దీంతో మాట్లాడడానికి ఆ అమ్మాయి ఆగింది. వెంటనే అమ్మాయిని వాహనంలో ఎక్కించుకుని సరోజినీ నగర్లోని ఫ్లాట్కు తీసుకుని వెళ్లి ఒక్కరి తర్వాత ఒక్కరు ఆమెపై అత్యాచారం చేశారు.
బాధితురాలు ఆటోలో ఇంటికి చేరుకుని విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. పోలీసులు మరో ఇద్దరిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications