పరిశీలనలో తెలంగాణ: షిండే, బెంగళూర్ పేలుడుపైనా

Sushil Kumar Shinde
న్యూఢిల్లీ: తెలంగాణ అంశం పరిశీలనలో ఉందని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. తెలంగాణపై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందని ఆయన చెప్పారు. గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన బెంగళూర్ పేలుడు సంఘటనపై మాట్లాడారు. పేలుడు ప్రభావం కర్ణాటక శాసనసభ ఎన్నికలపై ఉండదని ఆయన చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే కర్ణాటక శానససభ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు.

బెంగళూర్ పేలుడుపై దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటి వరకు దర్యాప్తులో ప్రగతి ఏమీ లేదని షిండే చెప్పారు. పేలుడు జరిగిన స్థలంలోని సిసిటివీ ఫుటేజ్‌ని పోలీసులు పరిశీస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో నిందితులను, కుట్రదారులను గుర్తించి, కేసులు పెడతామని ఆయన చెప్పారు. ఉగ్రవాద దాడులు ఇంకా ఎక్కడ జరుగుతాయనే సమాచారం లేదని ఆయన అన్నారు.

పేలుడుకు వాడిన బైక్ ఎవరిదనే విషయాన్ని పోలీసులు ఆరా తీశారని చెప్పారు. తమిళనాడు పోలీసుల సహకారంతో బైక్ యజమానిని గుర్తించినట్లు తెలిపారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని రాజకీయాలు చెప్పితే తాము భద్రత కల్పిస్తామని చెప్పారు. బెంగళూర్ వంటి నగరాల్లో భద్రత పెంచామని షిండే చెప్పారు.

రాష్ట్రాలకు గత మూడు నెలలుగా కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తోందని ఆయన చెప్పారు. మెట్రోపాలిటన్ సిటీలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని కూడా తాము చెబుతూ వస్తున్నామని అన్నారు. కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు అప్పగించడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోసం చూస్తున్నామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+