వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ తర్వాతే సిబిఐకి నోటీసులు: జగన్ పిటిషన్‌పై సుప్రీం

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పైన విచారణను అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఈ నెల 30వ తేదికి వాయిదా వేసింది. జగన్‌తో పాటు ఈ కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ బెయిల్ పిటిషన్ 29కి వాయిదా పడింది. నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్ విచారణను 30కి వాయిదా వేసింది.

జగన్ కేసులో ఎ2 నిందితుడు విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సిబిఐ పిటిషన్ పైన విచారణను కూడా అదే రోజుకు వాయిదా వేసింది. సిబిఐకి నోటీసులు జారీ చేయాలని జగన్ తరఫు న్యాయవాదులు సుప్రీం కోర్టును కోరారు. జగన్ బెయిల్ పైన విచారణ జరిపిన తర్వాతనే సిబిఐకి నోటీసులు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీం తెలిపింది. వాదనలు వినకుండా సిబిఐకి నోటీసులు జారీ చేయడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. సమయం లేనందునే విచారణను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

కాగా, తనకు బెయిల్ ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నిమ్మగడ్డ ప్రసాద్ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిని స్వీకరించిన కోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. సమయం లేనందున ముప్పయ్యవ తేదికి వాయిదా వేసింది.

English summary
YSR Congress Party chief and Kadapa MP YS Jaganmohan Reddy's bail petition hearing adjourned on to 30th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X