విదర్భపై కన్నేసిన శరద్ పవార్: టిజెఎసిలో ఎన్సీపి

ప్రత్యేక తెలగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ను శరద్ పవార్ ఇప్పటికే సమర్థించారు. టిజెఎసిలో చేరడం ద్వారా మరో అడుగు ముందుకేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో మహారాష్ట్రలో ప్రత్యేక విదర్భను చర్చనీయాంశం చేయడానికి శరద్ పవార్ సిద్ధపడినట్లు అర్థమవుతోంది.
టిజెఎసి చైర్మన్ కోదండరామ్, ఇతర నాయకులతో ఎన్సీపి ప్రధాన కార్యదర్శి డిపి త్రిపాఠి సోమవారం సమావేశమయ్యారు. ప్రస్తుతం తెలంగాణ జెఎసిలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), బిజెపి, న్యూడెమొక్రసీ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. ఎన్సిపీ కూడా చేరడంతో తెలంగాణ జెఎసి బలం పెరిగినట్లే. దాంతో దేశ రాజధానిలో తెలంగాణ నినాదం మరింత బలంగా వినిపించే అవకాశం ఏర్పడింది.
కాగా, తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని బిజెపి హామీ ఇచ్చింది. తెలంగాణ రాజకీయ జెఎసి ధర్నాకు బిజెపి పూర్తి మద్దతు ప్రకటించింది. మంగళవారం ఉమా భారతి తెలంగాణ జెఎసి నాయకుల దీక్షా శిబిరాని వచ్చి తన మద్దతు ప్రకటించారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కూడా దీక్షా స్థలికి వచ్చి మద్దతు ప్రకటించారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications