కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సహాయం చేస్తానని బంధించి ఆర్నెల్లుగా లైంగిక వేధింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
మెదక్/హైదరాబాద్: చదువు చెప్పిస్తానని ఓ అనాథ బాలికను చేరదీసిన ఓ వ్యక్తి ఆమెపై ఆరు నెలలుగా లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఆరు నెలలు ఆమెను బయటకు రానివ్వలేదు. ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు తన అక్క, నానమ్మలతో కలిసి మంగళవారం రాత్రి సిద్దిపేట వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించింది.

పోలీసుల వివరాల ప్రకారం... సిద్దిపేటలోని ఇందిరా నగర్‌లో ఉండే బాలిక(17) తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. ముగ్గురు కూమార్తెల్లో చిన్నదైన సదరు బాలిక నానమ్మ వద్దే ఉండేది. పదో తరగతి వరకు చదివి ఒక బట్టల దుకాణంలో పని చేసేది.

సదాశివపేటకు చెందిన మల్లేశం(47) స్థానికంగా పండ్ల వ్యాపారం చేసేవాడు. అప్పట్లో వీరి ఇంటి పక్కనే అద్దెకు ఉండేవాడు. అతడి ఇంట్లో టివి చూడ్డానికి ఆ బాలిక వెళ్లేది. అలా మల్లేశం పరిచయమయ్యాడు. చదివిస్తానంటూ తిరిగి సదాశివపేటకు ఏడాది కిందట వెళ్లేటప్పుడు ఆ బాలికను తీసుకెళ్లాడు. గడిచిన ఆరు నెలల నుంచి గదిలో నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.

మల్లేశం నిజస్వరూపాన్ని ఆలస్యంగా గ్రహించిన బాధితురాలు ఎలాగోలా ఈ నెల 12న బయటపడి మహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలో ఉండే తన బావ వద్దకు చేరింది. జరిగిన దారుణాన్ని వివరించింది. ఈ క్రమంలోనే అక్క, నానమ్మతో వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Orphans girl harassed by guardian
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X