జగన్ బెయిల్పై బెట్టింగ్స్?: క్యాడర్లో ఉత్కంఠ, చర్చలు
జగన్ బెయిల్ పిటిషన్ తీర్పు నేపథ్యంలో ఆయన సతీమణి వైయస్ భారతి రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు జూపూడి ప్రభాకర రావు, మాజీ మంత్రి మారెప్ప తదితరులు సుప్రీం కోర్టుకు వచ్చారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయానికి, జిల్లాల్లోని పార్టీ కార్యాలయాలకు నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. జగన్ బెయిల్ పైన తీర్పు కోసం రాష్ట్రవ్యాప్తంగా క్యాడర్ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.
జగన్ బెయిల్ పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో మాత్రమే కాకుండా రాజకీయ వర్గాల్లోను ఆసక్తికర చర్చ సాగుతోంది. జగన్కు బెయిల్ వస్తే రాష్ట్ర రాజకీయాలు ఎలా మారుతాయనే చర్చ అన్ని పార్టీలలోను సాగుతోంది. జగన్కు బెయిల్ వస్తే సంక్షోభంలో ఉన్న పార్టీని చక్కదిద్దుతారని జగన్ పార్టీ క్యాడర్ భావిస్తోంది. ఎన్నికలో మరెంతో దూరం లేనందున బెయిల్ వస్తేనే పార్టీ గట్టెక్కుతుందని ఆ పార్టీ భావిస్తోంది.
కాగా, మంత్రి కపిల్ సిబాల్ తండ్రి, సీనియర్ న్యాయవాది హీరాలాల్ మృతి కారణంగా సుప్రీం కోర్టు పదిహేను నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. జగన్ బెయిల్తో పాటు విజయ సాయి రెడ్డి బెయిల్ పిటిషన్ పైన తీర్పు రానుంది. జస్టిస్ సదాశివం, జస్టిస్ ఇక్బాల్లతో కూడిన బెంచ్ తీర్పు చెప్పనుంది.