టెక్కీలతో రామ్ చరణ్ రచ్చ: చిరంజీవికి తలనొప్పి?
హైదరాబాద్: టెక్కీలతో టాలీవుడ్ నటుడు, కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ గొడవ రచ్చరచ్చగా మారుతోంది. రామ్ చరణ్ తేజ గార్డులు తమపై దాడి చేశారని ఇద్దరు టెక్కీలు ఆరోపిస్తున్నారు. ఈ గొడవ చిరంజీవికి తలనొప్పిగా మారినట్లు ప్రచారం సాగుతోంది. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండడంతో తప్పెవరిదైనా తలనొప్పి చిరంజీవికే ఉంటుందని అంటున్నారు. టెక్కీలు తనకు క్షమాపణ చెప్పారని రామ్ చరణ్ చేసిన ప్రకటన గురువారంనాటి ఘటనతో తేలిపోయింది. ఇది మరింత సమస్యగా మారింది.
తమను ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ న్యాయవాది సలీం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేరారు. చిరంజీవి కేంద్ర మంత్రి కావడం వల్లనే పోలీసులు రామ్ చరణ్పై కేసు నమోదు చేయడం లేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై 18వ తేదీలోగా నివేదిక సమర్పించాలని మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ను ఆదేశశించింది.

క్షమాపణ కోరుతూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పోలీసులకు లేఖ ఇచ్చారని రామ్ చరణ్ చెప్పడంలో నిజం లేదని ఫణీష్ ఓ ఆంగ్ల దినపత్రికతో చెప్పారు. దీంతో వివాదం మొదటికి వచ్చింది. అయితే, క్షమాపణ కోరుతూ టెక్కీల నుంచి తమకు ఎటువంటి లేఖ కూడా ఇవ్వలేదని హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులు చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
అనవసరమైన ఇబ్బందులు వస్తాయని తమ కుటుంబ సభ్యులు చెప్పడం వల్లనే తాము ఫిర్యాదు చేయలేదని ఫణీష్ అన్నారు. దీంతో రామ్ చరణ్ తేజా గురువారం సాయంత్రం మీడియా ప్రతినిధుల ముందుకు వచ్చారు. తానే వారిపై దయ చూపినట్లు చెప్పుకొచ్చారు. పోలీసులు కేసు పెడితే టెక్కీలు విదేశాలకు వెళ్లడానికి ఇబ్బంది ఎదురవుతుందనే ఉద్దేశంతోనే తాను కరుణ చూపినట్లుగా చెప్పుకొచ్చారు. తాను చాలా హుందాగా ప్రవర్తించానని, కారు నుంచి కూడా దిగలేదని ఆయన అన్నారు.
ఫోటోలను మార్ఫింగ్ చేశారని, ఫోటోలు తీసిన వ్యక్తి తనను బ్లాక్ మెయిల్ చేశారని రామ చరణ్ చెప్పారు. వారు ఇద్దరు ఉన్నారని, తనతో పాటు తన భార్య ఉపాసన ఉందని ఆయన చెప్పారు. వారే తన పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. రచ్చ ఇలాగే కొనసాగితే తాను ఫిర్యాదు చేస్తానని హెచ్చరించే ధోరణిలో రామ్ చరణ్ అన్నారు. మొత్తం వివాదం రచ్చ రచ్చ అయ్యేట్లే ఉంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications