వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్ము జైల్లో గాయపడ్డ పాక్ ఖైదీ సనావుల్లా మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Pakistani prisoner Sanaullah dies
చండీగఢ్: జమ్ము కాశ్మీర్‌లోని కోటబల్వాల్ జైలులో భారతీయ ఖైదీల దాడిలో గాయపడిన పాకిస్తాన్ ఖైదీ సనావుల్లా మృతి చెందాడు. ఈ నెల 3వ తేదిన తోటి ఖైదీల చేతిలో సనావుల్లా గాయపడ్డాడు. దీంతో అతనిని జమ్ము ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఉత్తమ చికిత్స కోసం అక్కడి నుండి చండీగఢ్ జైలుకు తరలించారు.

అక్కడ వారం రోజుల నుండి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న సనావుల్లా మృతి చెందాడని వైద్యులు ఆరున్నర గంటలకు వైద్యులు ప్రకటించారు. సనావుల్లా 1994 బస్సు పేల్చివేత కేసులో నిందితుడు. అతనికి వైద్యులు అత్యుత్తమ చికిత్సను అందించినా కాపాడలేకపోయారు.

సనావుల్లా మృతిని భారత్ పాకిస్తాన్‌కు తెలియజేసింది. ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో విచారణ జరిపించాలని పాకిస్తాన్ డిమాండు చేసింది. సనావుల్లా వయస్సు 52. కాగా, సనావుల్లాపై దాడి పాకిస్తాన్‌లో ఖైదీగా ఉండి తోటి ఖైదీల చేతిలో గాయపడ్డ సరబ్‌జిత్ సింగ్ పైన దాడికి ప్రతిగా భావిస్తున్నారు.

సరబ్‌జిత్ సింగ్ ఇరవై మూడేళ్ల క్రితం భారత్ సరిహద్దు దాటి పాక్‌లోకి వెళ్లాడు. దీంతో అతనిని పాక్ సైన్యం పట్టుకుంది. అతనిని జైలుకు పంపించింది. ఆయనకు సంబంధం లేని కేసులను మోపి అతనిని ఇరవై మూడేళ్ల పాటు జైలులో ఉంచింది. ఇటీవల ఆయనపై జైలులో దాడి జరిగింది. చికిత్స పొందుతూ మృతి చెందారు.

English summary

 Pakistani prisoner Sanaullah Ranjay, who was beaten up by inmates in Jammu's Kot Bhalwal jail, died in Chandigarh hospital today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X