గిలానీ కుమారుడిని అపహరించిన సాయుధులు

సాయుధులు హైదర్ గిలానీ వ్యక్తిగత కార్యదర్శి మొహియుద్దీన్ను, గార్డును కాల్చి చంపినట్లు సమాచారం. సాయుధులు కాల్పులు జరుపుతూ హైదర్ గిలానీ వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సాయుధుల కాల్పుల్లో ఐదుగురు గాయపడినట్లు సమాచారం. ముల్తాన్లో ఎన్నికల ప్రచారం చేయవద్దని మిలిటెంట్ గ్రూపులు ఇంతకు ముందు హెచ్చరించాయి. ఈ నెల 11వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల ప్రచారం గురువారంతో ముగుస్తోంది.
హైదర్ గిలానీ అపహరణపై అధికారికంగా ఇప్పటి వరకు ఏ విధమైన సమాచారం రాలేదు. ఆయనను అపహరించింది ఎవరనేది కూడా తెలియడం లేదు. ఏ గ్రూప్ కూడా ఇంతవరకు తాము అపహరించామనే విషయాన్ని ప్రకటించలేదు.
యూసుఫ్ రజా గిలానీ మరో కుమారుడు అలీ మూసా గిలానీ ఏడుస్తూ పార్టీ కార్యకర్తలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలను టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. దుండగులు కారులో వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ హైదర్ గిలానీని చేరుకున్నట్లు చెబుతున్నారు. ఆయనను కారులో ఎక్కించుకుని కాల్పులు జరుపుతూ పారిపోయినట్లు సమాచారం.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications