Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యడ్యూరప్పకు, బిఎస్సార్ పార్టీకి బిజెపి బుజ్జగింపులు!

Yeddyurappa
న్యూఢిల్లీ/బెంగళూరు: తమ నుండి విడిపోయి కొత్త పార్టీలు పెట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప, గాలి జనార్ధన్ రెడ్డిలను మళ్లీ చేరదీయాలనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో యడ్యూరప్ప కర్నాటక జనతా పార్టీ, గాలి అనుచరుడు శ్రీరాములు స్థాపించిన బిఎస్సార్ కాంగ్రెసు పార్టీలు బిజెపి విజయావకాశాలను దెబ్బతీశాయి. దీంతో నష్ట నివారణ చర్యలకు బిజెపి తెరలేపినట్లుగా తెలుస్తోంది.

పార్టీకి దూరమైన యడ్యూరప్పను మళ్లీ దరిచేర్చి 2014 లోక్‌సభ ఎన్నికల నాటికి సమాయత్తమయ్యేందుకు బిజెపి సన్నాహాలు ప్రారంభిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, రాజ్యసభ ప్రతిపక్షనేత అరుణ్ జైట్లీ ఈ దిశగా ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది.

యడ్యూరప్ప లేకపోతే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో బిజెపి విజయాలు కష్టం కాగలవని భావిస్తున్న ఈ నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇవి వాస్తవ రూపం దాల్చడానికి మరో రెండు మూడు నెలల సమయం పట్టవచ్చునని అంటున్నారు. యడ్డీకి మళ్లీ పార్టీ తీర్థం ఇచ్చే అవకాశాలు ఉన్నాయట. ఆయనకు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి అప్పగిస్తారట.లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక అధికారం కూడా ఆయనకే కట్టబెడతారట.

బిజెపికి దూరమైన శ్రీరాములు వర్గాన్ని కూడా మళ్లీ పార్టీలోకి ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయట. ఇవన్నీ వాస్తవరూపం దాలిస్తే 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బిజెపి గట్టిపోటీ ఇవ్వడం తథ్యమని అంటున్నారు. కేంద్రంలో ఎన్డీయే అధికార పగ్గాలు చేపట్టాలంటే కర్ణాటకలో అత్యధిక లోక్‌సభ స్థానాలను గెలవక తప్పదు. అయితే బిజెపిలో చేరే ప్రశ్నేలేదని యడ్యూరప్ప గురువారం కూడా స్పష్టం చేయడం విశేషం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+