సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారంలో అపశృతి: ఒకరి మృతి

దాదాపు యాభై వేల మంది కార్యకర్తలు వచ్చినట్లుగా అంచనా వేస్తున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయ్యాక అందరు ఒక్కసారిగా బయటకు వచ్చే ప్రయత్నాలు చేశారు. ఈ స్టేడియంలో గేట్లు చిన్నగా ఉండటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నంజప్పతో సహా నలుగురు గాయపడ్డారు. నంజప్పను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇతను మృతి చెందాడు.
కాగా, కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ భరద్వాజ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర రాజధాని బెంగళూరులోని కంఠీరవ క్రీడా మైదానంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో కాంగ్రెసు నేతలు, కార్యకర్తలు తరలి వచ్చారు.
సిద్ధరామయ్య 28వ ముఖ్యమంత్రిగా పదకొండు గంటల నలభై నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎం కృష్ణ, అంబరీష్, కేంద్రమంత్రి మల్లికార్జున ఖర్గే, కెపిసిసి అధ్యక్షుడు పరమేశ్వర, మధుసూదన్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications