వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఖాకీ వర్సెస్ ఖాకీ: కొట్టుకుని, కెమెరాకు చిక్కారు
ముఖ్యమంత్రి భద్రతలో ఉన్న పిఎసి (ప్రొవిన్షియల్ సాయుధ కానిస్టబులరీ)కి చెందిన ఇద్దరు జవాన్లు పరస్పరం లాఠీలతో కొట్టుకున్నారు. అఖిలేష్ యాదవ్ ఓ సభలో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఈ సంఘటన గోమతినగర్లో చోటు చేసుకుంది.
జవాన్ల మధ్య ఘర్షణకు కారణమేమిటనేది తెలియదు. శాంతిభద్రతల విషయంలో ఉత్తరప్రదేశ్కు ఘనచరిత్ర ఉంది. ఈ సంఘటన దానికి మరింతగా తోడవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఓ జవానుకు తీవ్రంగా గాయాలై నెత్తురు కారింది.
ఇద్దరు కానిస్టేబుళ్లు కూడాీ ముఖ్యమంత్రికి అదనపు భద్రతను కల్పిచే పిఎసి పదో బెటాలియన్కు చెందినవారు. ఈ సంఘటనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు విచారణకు ఆదేశించారు. హెడ్ కానిస్టేబుల్ ముకుల్ చంద్ర యావద్, కానిస్టేబుల్ సునీల్ దీక్షిత్ ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి.
Comments
English summary
Cops brandishing lathi on street protesters is a familiar sight, but it gets bizarre when the constables exchange lathi blows among themselves.
Story first published: Wednesday, May 22, 2013, 16:29 [IST]