వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖాకీ వర్సెస్ ఖాకీ: కొట్టుకుని, కెమెరాకు చిక్కారు

By Pratap
|
Google Oneindia TeluguNews

Police
లక్నో: పోలీసులు లాఠీచార్జీ చేయడం, లాఠీలు ఝళిపించడం సర్వసాధారణం. కానీ, ఇరువురు పోలీసులు ఒకరినొకరు లాఠీలతో కొట్టుకున్న సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ ఇద్దరు జవాన్లు కూడా ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భద్రతా విభాగానికి సంబంధిచినవారు కావడం విశేషం.

ముఖ్యమంత్రి భద్రతలో ఉన్న పిఎసి (ప్రొవిన్షియల్ సాయుధ కానిస్టబులరీ)కి చెందిన ఇద్దరు జవాన్లు పరస్పరం లాఠీలతో కొట్టుకున్నారు. అఖిలేష్ యాదవ్ ఓ సభలో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఈ సంఘటన గోమతినగర్‌లో చోటు చేసుకుంది.

జవాన్ల మధ్య ఘర్షణకు కారణమేమిటనేది తెలియదు. శాంతిభద్రతల విషయంలో ఉత్తరప్రదేశ్‌కు ఘనచరిత్ర ఉంది. ఈ సంఘటన దానికి మరింతగా తోడవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఓ జవానుకు తీవ్రంగా గాయాలై నెత్తురు కారింది.

ఇద్దరు కానిస్టేబుళ్లు కూడాీ ముఖ్యమంత్రికి అదనపు భద్రతను కల్పిచే పిఎసి పదో బెటాలియన్‌కు చెందినవారు. ఈ సంఘటనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు విచారణకు ఆదేశించారు. హెడ్ కానిస్టేబుల్ ముకుల్ చంద్ర యావద్, కానిస్టేబుల్ సునీల్ దీక్షిత్ ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి.

English summary
Cops brandishing lathi on street protesters is a familiar sight, but it gets bizarre when the constables exchange lathi blows among themselves.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X