అమ్మ మెతక, నేను చాలా కఠినం: రాహుల్ గాంధీ

మరో నెలరోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందరూ కలిసి కట్టుగా శ్రమించి, సమన్వయంతో పనిచేసి నాలుగోసారి పార్టీకి ఢిల్లీలో అధికారం కట్టబెట్టేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ముఖ్యంగా పార్టీ నేతల క్రమశిక్షణ వ్యవహారంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మెతగ్గా వ్యవహరించారని, తాను మాత్రం అలాంటి వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘనను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించనని నేతలను హెచ్చరించారు.
పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఉండాలని కూడా ఆయన ఆశించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్కు, పార్టీ అధ్యక్షుడు జెపి అగర్వాల్కు మధ్య నెలకొన్న విభేదాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఆ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. కలిసికట్టుగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications