'అమ్మ' ఇడ్లీ హిట్: ఇప్పుడు 'అమ్మ' మినరల్ వాటర్

అమ్మ మినరల్ వాటర్ ప్లాంట్లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. మొదటి ప్లాంటును చెన్నై శివారులోని గుమ్ముండిపూండిలో ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. రోజుకు మూడు లక్షల లీటర్ల మినరల్ వాటర్ను ఇది అందిస్తుందని, సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అది పనిచేయడం ప్రారంభిస్తుందని ఆమె అన్నారు.
ఆ మినరల్ వాటర్ బాటిల్స్ను ఎక్కువ దూరం ప్రయాణించే బస్సుల్లో, బస్ స్టాండుల్లో విక్రయించనున్నట్లు ఆమె తెలిపారు. రైల్వేలు 15 రూపాయలకు, ప్రైవేట్ సంస్థలు 20 రూపాయలకు లీటర్ మినరల్ వాటర్ విక్రయిస్తుండగా తమ రోడ్డు రవాణా సంస్థ పది రూపాయలకే అందిస్తుందని ఆమె చెప్పారు.
ఆహార పదార్థాలను తక్కువ ధరకు విక్రయించడానికి తమ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అమ్మ క్యాంటిన్లను తెరిచిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తక్కువ ధరలకు కూరగాయలను అందించడానికి ప్రభుత్వం ఇటీవల దుకాణాలను కూడా తెరిచింది. చెన్నైలోనూ, శివారుల్లోనూ అటువంటి కూరగాయల దుకాణాలు 31 ఉన్నాయి.












Click it and Unblock the Notifications