వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారు పెట్టినా, తెలంగాణపై గడువు పెట్టను: దిగ్విజయ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Digvijay Singh
న్యూఢిల్లీ: తెలంగాణపై ఇప్పటికే ఎంతోమంది ఎన్నో గడువులు పెట్టారని, తాను మాత్రం ఎలాంటి గడువును పెట్టనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ బుధవారం అన్నారు. ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు.

తెలంగాణతో పాటు రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పైన వారు చర్చించుకున్నారు. కిరణ్, దిగ్విజయ్ చాలా సేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ పై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై కిరణ్ కుమార్ రెడ్డితో చర్చించినట్లు చెప్పారు. అందులో తెలంగాణ అంశం కూడా ఉందన్నారు.

తెలంగాణకు ఎప్పటిలోగా పరిష్కారం లభిస్తుందని ప్రశ్నిస్తే.. తాను ఎలాంటి గడువును పెట్టబోనని అన్నారు. తెలంగాణపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటామో చెప్పలేమని అభిప్రాయపడ్డారు. డెహ్రూడూన్‌లో పార్లమెంటు సభ్యుల మధ్య గొడవ దురదృష్టకరమని, విపత్తుల సమయంలో అటువంటివి హర్షదాయకం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

దిగ్విజయ్ పర్యటనలో మార్పు

దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయన ముందుగా అనుకున్నట్లుగా ఈ నెల 28వ తేది కాకుండా 1వ తేదిన రాష్ట్రానికి రానున్నారు.


సోనియా పిలుపు కోసం కిరణ్ నిరీక్షణట

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు కోసం కిరణ్ కుమార్ రెడ్డి నిరీక్షిస్తున్నారు. సోనియా పిలుపు కోసం కిరణ్ దాదాపుగా రోజంతా ఎపి భవన్‌లో ఉన్నారు. మధ్యలో ఓసారి రక్షణ మంత్రి ఎకె ఆంటోనీతో భెటీ అయ్యారు.

English summary

 State Congress Party incharge Digvijay Singh on Wednesday said he will not give any dead line for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X