హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెక్ బౌన్స్: జీవితా రాజశేఖర్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jeevitha Rajasekhar summoned
హైదరాబాద్: ప్రముఖ నటుడు రాజశేఖర్ సతీమణి, దర్శక నిర్మాత జీవితలకు బుధవారం నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 20వ తేదిన కోర్టు ముందు హాజరు కావాలని సమన్లలో కోర్టు ఆదేశించింది. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగి పరంధామ రెడ్డికి సినీ నటి జీవితతో గత పదేళ్లుగా పరిచయం ఉంది.

ఈ నేపథ్యంలో వ్యాపార అవసరాల నిమిత్తం జీవిత గత ఏడాది పరంధామ రెడ్డి నుండి రూ.34 లక్షల మొత్తాన్ని రుణంగా తీసుకున్నారు. ప్రామిసరీ నోటు, రెండు చెక్కులు, హామీ పత్రాలను ఆయనకు జీవిత అందజేశారు. ఈ మొత్తాన్ని చెల్లించక పోవడంతో పరంధామ రెడ్డి ఆమెకు చెప్పి రూ.34 లక్షలకు చెక్కులను బ్యాంకులో డిపాజిట్ చేశారు.

ఆ చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన 17వ అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్టేట్ చెల్లని చెక్కు కేసులో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని జీవితా రాజశేఖర్‌ను ఆదేశిస్తూ కోర్టు నిన్న సమన్లు జారీ చేసింది.

English summary

 A Nampally court on Wednesday issued summons to actor Rajasekhar's wife Jeevitha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X