వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి జోకర్‌లా వ్యవహరిస్తున్నారు: రేవంత్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Revanth Reddy
హైదరాబాద్: కేంద్ర మంత్రి చిరంజీవి వరద బాధితులను పట్టించుకోకుండా జోకర్‌లా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగువారికి సహాయం అందించడంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు.

ముఖ్యమంత్రి వరద బాధితులను పట్టించుకోవడం లేదని, రాష్ట్ర చరిత్రలో కిరణ్ కుమార్ రెడ్డి అంతటి అసమర్థ ముఖ్యమంత్రిని చూడలేదని ఆయన అన్నారు బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్లనే తమ పార్టీ చొరవ చూపిందని ఆయన చెప్పారు. కాంగ్రెసు దొంగల ముఠా పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు.

డెహ్రడూన్‌లో తమ పార్లమెంటు సభ్యుల పట్ల కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. అధికారం పొతుందనే భయంతో కాంగ్రెసు నాయకులు విచక్షణ కోల్పోయారని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయం చేస్తూ బాధితులను నిర్లజ్జగా గాలికి వదిలేశారని ఆయన అన్నారు. కాళ్లుపట్టుకుంటే ముఖ్యమంత్రి పదవి ఉంటుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్విజయ్ సింగ్ చుట్టూ తిరుగుతున్నారని అన్నారు.

మధ్యప్రదేశ్ ఎన్నికలకు నిధుల కోసమే దిగ్విజయ్ సింగ్‌ను రాష్ట్రానికి పంపిస్తున్నారని ఆయన అన్నారు. తమ పార్లమెంటు సభ్యుల పట్ల వ్యవహరించిన తీరుకు కాంగ్రెసు నాయకులపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై తమ పార్టీ స్పష్టంగా చెప్పిందని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెసు పార్టీ పంచాయతీ మెంబర్ పదవిని కూడా గెలువలేదని ఆయన అన్నారు.

English summary
The Telugudesam MLA Revanth Reddy termed union minister Chiranjeevi as joker. He criticised that CM Kiran kumar Reddy failed extend relief to Uttarakhand floods Andhra victims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X