వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో కదులుతున్న కారులో ఇద్దరు మహిళలపై రేప్

By Srinivas
|
Google Oneindia TeluguNews

women
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో గతేడాది డిసెంబరులో ఓ యువతిపై సామూహిక అత్యాచారం ఘటన మరువక ముందే మరో దారుణం జరిగింది! తమను కారులో అత్యాచారం చేశారని ఇద్దరు మహిళలు పోలీసులను ఆశ్రయించారు. గుర్గావ్‌లో కదులుతున్న కారులో తమపై ఈ అఘాయిత్యానికి దుండగులు పాల్పడ్డారని వారు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

బుధవారం అర్ధరాత్రి ఒకటి రెండు గంటల మధ్య ప్రాంతంలో ఫిర్యాదు చేసిన ఇద్దరు మహిళలు మెహ్రౌలీ - గుర్గావ్ రహదారిలోని ఓ పబ్బు బయట నిలబడి ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ సమయంలో వారికి ఓ డ్రైవర్ తన కారులో లిఫ్ట్ ఇస్తానని చెప్పాడని, వారిని ఢిల్లీలో దింపుతానని చెప్పాడని తెలిపారు.

కారులోకి మరో ఇద్దరు వ్యక్తులు ఎక్కినట్లు మహిళలు ఫిర్యాదు చేశారు. వారు తమను కదులుతున్న కారులో అత్యాచారం చేశారని చెప్పారు. వైద్య పరీక్షల్లో వారు అత్యాచారానికి గురైనట్లుగా తేలిందని, వారి శరీరం పైన కూడా గాయాలు ఉన్నాయని చెప్పారు. కాగా అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు నిందితులు పారిపోయారు. డ్రైవర్‌తో పాటు కారును పోలీసులు గుర్తించారు.

నేను చేయలేదన్న ఢిల్లీ నిందితుడు

గతేడాది ఢిల్లీలో జరిగిన అత్యాచార ఘటనపై జువెనైల్ నిందితుడు తాను ఈ అత్యాచారం చేయలేదని చెప్పాడు. తాను ఈ నేరంలో పాలుపంచుకోలేదని చెప్పాడు.

మణిపాల్ గ్యాంగ్ రేపే నిందితుడి ఆత్మహత్యాయత్నం

మణిపాల్ విశ్వవిద్యాలయ వైద్య విద్యార్థినిపై ఆత్యాచారం చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు గురువారం ఆత్మహత్యాయత్నం చేశాడు. కర్నాటక పోలీసులు ఇతనితో పాటు మరొక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మూడో నిందితుడు పరారీలోనే ఉన్నాడు.

English summary
Two women from Delhi have told the police that they were raped in a moving car in the satellite town of Gurgaon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X