వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు: వరదలపై మర్రి ప్రకటన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Uttarakhand
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో గురువారం స్వల్పంగా భూమి కంపించింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ సమీపంలోని పితోర్‌గఢ్ ప్రాంతంలో ఈ భూ ప్రకంపనలు మధ్యాహ్నం సంభవించాయి. రిక్టర్ స్కేలు పైన ఇది 3.5గా నమోదయింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజల ఇళ్ల నుండి బయటకు వచ్చారు.

మరోవైపు ఉత్తరాఖండ్ వరదల పైన ఎన్డీఎంఏ సమావేశమైంది. ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడారు. ఉత్తరాఖండ్ వరదల్లో 556 మంది మృతి చెందారని చెప్పారు. ఇంకా 1800 మంది వరదల్లో చిక్కుకుపోయారన్నారు. ఇప్పటి వరకు లక్ష మందికి పైగా భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించనట్లు చెప్పారు. హెలికాప్టర్ ప్రమాదంలో 18 మంది మృతదేహాలను కనుగొన్నట్లు తెలిపారు.

కాగా ఈ రోజు సాయంత్రం 130 మంది యాత్రికులతో ప్రత్యేక విమానం డెహ్రాడూన్ నుండి బయలుదేరుతుందని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బద్రీనాథ్‌లో చిక్కుకున్న 250 మంది తెలుగు యాత్రికులు కాలి నడకన జోషిమఠ్ బయలుదేరారని చెప్పారు.

తెలుగు యాత్రికులు జోషిమఠ్ నుంచి శుక్రవారం సాయంత్రం డెహ్రాడూన్ చేరుకునే అవకాశముందన్నారు. రేపు డెహ్రాడూన్ నుండి యాత్రికులను ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు తరలిస్తామని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా చెప్పారు.

English summary
Minor earthquake measuring 3.5 in Pithorgarh, Uttarakhand
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X