అప్పు: స్నేహితురాలిపై దాడి, ఎమ్మెల్యే భార్యపై ఫిర్యాదు

ఇంకా రూ.1.80 కోట్లు ఇవ్వాల్సి ఉందంటూ సుధీర్ రెడ్డి మేనల్లుడుని వెంటబెట్టుకొని కమల ఆదివారం రాత్రి అరుణ ఇంటికి వచ్చి గొడవ చేశారు. ఈ క్రమంలో అరుణ తలకు గాయమైంది. దీంతో మిగిలిన డబ్బులు ఇవ్వకుంటే తనను చంపుతానని బెదిరించారని, తన కుటుంబానికి కమల నుండి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలంటూ అరుణ ఆదివారం సైదాబాద్ పోలీసులను ఆశ్రయించారు.
ఆస్మాన్ఘడ్ త్రివేణి నగర్లో ఉండే ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆంజనేయులు, భార్య అరుణ ఉంటున్నారు. కమల నుంచి రూ.2 కోట్లు అప్పు తీసుకున్న అరుణ.. ఆ డబ్బును అధిక వడ్డీకి అబిడ్స్లోని ఓ జువెలర్స్ యజమానికి ఇచ్చారు. సదరు జువెలర్స్ యజమాని వ్యాపారంలో నష్టం వచ్చి దివాళా తీశాడు. ఇటీవల ఐపి పెట్టాడు.
ఈ నేపథ్యంలో అప్పు మొత్తం తీర్చానని అరుణ చెప్పగా.. ఇంకా చెల్లించాల్సి ఉందని కమల అరుణ ఇంటికి వచ్చి గొడవ పడ్డారు. తాను చెల్లించాల్సిది ఏమీ లేదని అరుణ చెప్పడంతో వారు ఆమెపై దాడి చేశారు. అరుణకు గాయమైంది. అరుణ నుంచి ఫిర్యాదు తీసుకున్నామని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సైదాబాద్ ఇన్స్పెక్టర్ ఎ.శ్రీనివాసులు తెలిపారు. కాగా, తన భార్యను పావుగా చేసి కొందరు రాజకీయ లబ్ధి పొందేందుకు నాటకాలాడుతున్నారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆరోపించారు.
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications