అఫైర్: భర్తను చంపిన భార్య, రక్తం దుస్తులతో పిఎస్కు

ఈ సంఘటన గోకుల్పురిలో జరిగింది. ఉత్తమ్ దేవి అనే 33 ఏళ్ల మహిళ తన భర్త తలను దాదాపు డజన్ సార్లు గోడకేసి బాదింది. ఆ తర్వాత గొంతు నులిమి చంపింది. మహిళను పోలీసులు అరెస్టు చేసి ఆమె భరత్ సింగ్ శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
హత్యలో మహిళ సోదరుడు, మరికొంత మంది పాలు పంచుకుని ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ భరత్ ధనపాల్ సింగ్ (43) నోయిడాలోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఓ యువతితో సింగ్ అక్రమ సంబంధంపై భార్య ఉత్తమ్ దేవి తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. ఈ నెల 4వ తేదీన భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.
సోమవారం మరోసారి ఇరువురి మధ్య గొడవ జరిగింది. భార్య ఉత్తమ్ను సింగ్ కొట్టడమే కాకుండా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో ప్రతీకారం తీర్చుకోవడానికి ఉత్తమ్ తన సోదరుడు, మరి కొంత మందిని కూడగట్టుకుని మంగళవారం ఉదయం హత్య చేసినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications