సోనియా ఇంటి వద్ద బొత్సకు పరాభవం: డిగ్గీదే ఫైనల్

సమావేశంలో పాల్గొనడానికి వచ్చానని చెప్పినా సిబ్బంది వినిపించుకోకపోవడంతో బొత్స వారితో వాగ్వాదానికి దిగారు. భేటీలో పేరు లేదని భద్రతా సిబ్బంది అనుమతి నిరాకరించడంతో అవమానంతో బొత్స వెనుదిరిగారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో బొత్స సత్యనారాయణ శనివారం ఉదయం సమావేశమయ్యారు.
తెలంగాణపై తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ మాటలే ఫైనల్ అని బొత్స సత్యనారాయణ అన్నారు. పార్టీ కోర్ కమిటీ సమావేశం తర్వాత దిగ్విజయ్ సింగ్ ప్రకటన చేసారని, ఇక తెలంగాణపై మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. పిసిసి సమన్వయ కమిటీ, మానిఫెస్టో కమిటీల్లో మార్పులపై తాను దామోదర రాజనర్సింహ అభిప్రాయం కోరినట్లు ఆయన తెలిపారు.
యుపిఎ ప్రభుత్వం తీసుకురావడానికి తలపెట్టిన ఆహార భద్రత చట్టం గురించి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెసు పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పిసిసి అధ్యక్షులు, సిఎల్పీ నాయకులతో సమావేశమయ్యారు. ఆహార భద్రత చట్టం ప్రాముఖ్యం గురించి ఆమె వారికి వివరించారు. సమావేశానికి కోర్ కమిటీ సభ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications