తెలంగాణపై ఏదైనా: ఆగస్టులో చంద్రబాబు బస్సుయాత్ర!

పంచాయతీ ఎన్నికల అనంతరం మున్సిపల్, జెడ్పీ ఎన్నికలు జరిగితే మాత్రం వాటి తర్వాత ప్రారంభించే అవకాశముంది. లేదంటే ఆగస్టు చివరి వారంలో ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. వస్తున్నా మీకోసం పాదయాత్రలో బాబు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, చిత్తూరు, కడప తదితర జిల్లాలకు వెళ్లలేదు. బస్సుయాత్రతో వాటిని కూడా చుట్టి రానున్నారు.
తెలంగాణపై జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో బాబు పాదయాత్రపై సందిగ్ధం కూడా అవసరం లేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని, తమ నిర్ణయాన్ని ఎప్పుడో చెప్పాని, కాబట్టి ఇక దాని గురించి తమ పార్టీ మాట్లాడాల్సిన అవసరం లేదని భావిస్తున్నారట. కేంద్రం తెలంగాణపై ఎలాంటి ప్రకటన చేసినా బస్సుయాత్రతో ముందుకు వెళ్లాలనే ఆలోచనలో బాబు ఉన్నారట.
విజయం మనదే: బాబు
'రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయానికి పంచాయతీ ఎన్నికలతో శంఖం పూరించాలి. మీ సత్తా చాటండి. అఖండ విజయంతో నాయకత్వాన్ని రుజువు చేసుకోండి. సమర్థ పంచాయతీరాజ్ వ్యవస్థ అభివృద్ధికి నేతృత్వం కోసం దూసుకు రండి' అని తమ పార్టీ సర్పంచి అభ్యర్థులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఆయన వారికో లేఖ రాశారు. ప్రస్తుత ఎన్నికల్లో వారి గెలుపు భవిష్యత్తు విజయాలకు పునాదిగా నిలుస్తుందని అందులో పేర్కొన్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications