తెలంగాణపై ఏదైనా: ఆగస్టులో చంద్రబాబు బస్సుయాత్ర!
పంచాయతీ ఎన్నికల అనంతరం మున్సిపల్, జెడ్పీ ఎన్నికలు జరిగితే మాత్రం వాటి తర్వాత ప్రారంభించే అవకాశముంది. లేదంటే ఆగస్టు చివరి వారంలో ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. వస్తున్నా మీకోసం పాదయాత్రలో బాబు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, చిత్తూరు, కడప తదితర జిల్లాలకు వెళ్లలేదు. బస్సుయాత్రతో వాటిని కూడా చుట్టి రానున్నారు.
తెలంగాణపై జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో బాబు పాదయాత్రపై సందిగ్ధం కూడా అవసరం లేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని, తమ నిర్ణయాన్ని ఎప్పుడో చెప్పాని, కాబట్టి ఇక దాని గురించి తమ పార్టీ మాట్లాడాల్సిన అవసరం లేదని భావిస్తున్నారట. కేంద్రం తెలంగాణపై ఎలాంటి ప్రకటన చేసినా బస్సుయాత్రతో ముందుకు వెళ్లాలనే ఆలోచనలో బాబు ఉన్నారట.
విజయం మనదే: బాబు
'రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయానికి పంచాయతీ ఎన్నికలతో శంఖం పూరించాలి. మీ సత్తా చాటండి. అఖండ విజయంతో నాయకత్వాన్ని రుజువు చేసుకోండి. సమర్థ పంచాయతీరాజ్ వ్యవస్థ అభివృద్ధికి నేతృత్వం కోసం దూసుకు రండి' అని తమ పార్టీ సర్పంచి అభ్యర్థులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఆయన వారికో లేఖ రాశారు. ప్రస్తుత ఎన్నికల్లో వారి గెలుపు భవిష్యత్తు విజయాలకు పునాదిగా నిలుస్తుందని అందులో పేర్కొన్నారు.