Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గుండెపోటుతో కోటగిరి విద్యాధర రావు ఆకస్మిక మృతి

Kotagiri Vidyadhara Rao
ఏలూరు: మాజీ మంత్రి కోటగిరి విద్యాధర రావు హఠాన్మరణం చెందారు. ప్రస్తుతం ఆయన ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ (పిసిసి) అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆయన శనివారం ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని తన నివాసంలో ఆయన కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించేలోగానే ఆయన మృత్యువాత పడ్డారు.

కొద్ది రోజుల క్రితం ఆయన గుండెకు సంబంధించిన వ్యాధికి చికిత్స చేయించుకున్నట్లు తెలుస్తోంది. కోటగిరి విద్యాధరరావు ఎన్టీ రామారావు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గాల్లో పనిచేశారు. ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో తొలిసారి 1994లో మంత్రి పదవి చేపట్టారు. ఆయన వ్యవసాయ శాఖను నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన భారీ పరిశ్రమల మంత్రిగా పనిచేశారు.

1983లో ఆయన శానససభకు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 1985 నుంచి 1999 వరకు వరుసగా ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన ఆ పార్టీలో చేరి కీలకమైన పాత్ర పోషించారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం కావడంతో ఆయన కాంగ్రెసు పార్టీ నాయకుడిగా ఉన్నారు.

కోటగిరి విద్యాధర రావు మృతికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన మృతికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సంతాపం ప్రకటించారు. కోటగిరి మరణవార్త తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి చిరంజీవి ఢిల్లీ నుంచి హుటాహుటిన బయలుదేరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+