వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాడి ఫిర్యాదు: మంత్రి విశ్వరూప్ తనయుడిపై కేసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రాష్ట్ర మంత్రి పినిపె విశ్వరూప్ తనయుడు కృష్ణా రెడ్డి పైన ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. భూవివాదంలో తనపై దాడి చేశారంటూ రాఘవులు అనే వ్యాపారి కృష్ణా రెడ్డి పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెదిరింపులు, దాడికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

అగ్ని ప్రమాదం

చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరులోని జైన్ మామిడిగుజ్జు పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

సెక్యూరిటీ గార్డు మృతి

హైదరాబాదులోని ల్యాంకో హిల్సులో ప్రమాదవశాత్తు తొమ్మిదో అంతస్తు నుంచి పడి సెక్యూరిటీ గార్డు మృతి చెందాడు.

నిలిచిపోయిన రైళ్లు

అదిలాబాదు జిల్లా రెబ్బన రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే లైనులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పుష్‌పుల్, తెలంగాణ ఎక్సుప్రెస్ రైళ్లు రెండు గంటలుగా మందమర్రి రైల్వే స్టేషనులో నిలిచిపోయాయి.

హత్య

రంగారెడ్డి జిల్లా కేసరి మండలం దమ్మాయిగూడలో ఎస్ఎఫ్‌సి విశ్రాంత శాస్త్రవేత్త హత్యకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

అగ్ని ప్రమాదం

తూర్పు గోదావరి జిల్లాలోని మురమళ్ల న్యూకాలనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. దాదాపు ఇరవై లక్షల మేర నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది.

English summary
A case was booked against minister Vishwaroop's son Krishna Reddy on Wednesday at SR Nagar Police Station in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X