భయమెందుకు, హైద్రాబాద్పై అపార్థం వద్దు: టిపై డిగ్గీ

ఆ తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా ఉంటుందన్నారు. ఉమ్మడి రాజధాని విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు. తెలంగాణ బిల్లు త్వరగా ఆమోదం పొందేందుకు అందరూ ప్రయత్నించాల్సి ఉంటుందని చెప్పారు. మూడు ప్రాంతాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలోనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
కోస్తా ప్రాంతం తీర ప్రాంతమని, భారీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని, అందుకే సీమాంధ్ర అభివృద్ధికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. విద్యుత్ ఉత్పత్తి అదనంగా ఉందని చెప్పారు. రాష్ట్ర విభజన అంటే కుటుంబాన్ని విభజించినట్లేనని, సంతోషకరమైన చర్య కాదన్నారు. కానీ మూడు ప్రాంతాల ప్రజల కోసం విభజించక తప్పలేదన్నారు.
సమయం ఇంకా అయిపోలేదు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సమయం ఇంకా అయిపోలేదని మంత్రి శైలజానాథ్ అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం తమ ప్రయత్నాలు తాము చేస్తున్నామని చెప్పారు. పార్టీల పైన ప్రజలు ఒత్తిడి తీసుకు రావాలన్నారు. తాము తదుపరి కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications