మా అమ్మ జైలుకెళ్లింది: నెమరేసుకున్న గీతారెడ్డి
ఇది చారిత్రాత్మక రోజని అభి వర్ణించారు. అమరవీరులకు కొత్త రాష్ట్రం అంకితమని అన్నారు. ఈ సందర్భంగా ఆమె తన తల్లి, రిపబ్లికన్ పార్టీ నా యకురాలైన జె.ఈశ్వరీభాయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించి జైలు పాలైన రోజులను ఆమె గుర్తు చేసుకున్నారు. భావోద్వేగానికి లోనైనా మంత్రి గీతారెడ్డి త న తల్లిలాంటి వారితోపాటు 1969లోనూ గత పదే ళ్లలోనూ ఎంతో మంది పోరుబాట పట్టారని, వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని వారి త్యాగం వృధా కాలేదని అన్నారు.
తన తల్లి తెలంగాణ ప్రజాసమితి ఉపాధ్యక్షురాలిగా తెలంగాణ కోసం జైలుపాలైన సందర్భాన్ని నెమ రువేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వాళ్లు పలుమార్లు ఈశ్వరీభాయిని గుర్తు చేసుకున్నారని గీతారెడ్డి అన్నారు. తనకు చాలా చాలా ఆనందంగా ఉందని, ఈ క్షణాలను పట్టరాని సంతోషాన్ని మాటల్లో చెప్పలేనని అన్నారు. మాట తప్పని ధీరురాలిగా సోనియాగాంధీ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు.
2009 డిసెంబర్ 9వ తేదీన ఆమె జన్మదినం రోజు ఇచ్చిన మాటను తూచ తప్పకుండా అమలు చేశారని ఆమె సోనియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సిడబ్ల్యుసి, యుపిఎ తెలంగాణకు పచ్చజెండా ఊపడం చరిత్రలో భాగంగా నిలిచిపోతుందని 56 సంవత్సరాలు ఒక ప్రజా ఉద్యమం నిరంతరాయంగా కొనసాగడం దేశంలో ఇదే ప్రథమమని చెప్పారు.