వైయస్వల్లే బీజం: సోమిరెడ్డి, అడ్డుకోం కానీ: నన్నపనేని

హైదరాబాదులో సీమాంధ్ర రక్షణకు కేంద్రం తీసుకునే నిర్ణయాలు ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు హైదరాబాదు పైన ఇంకా ఏం స్పష్టత కావాలన్నారు. తెలంగాణకు అడ్డుపడాలన్న ఉద్దేశ్యం తమకు ఏమాత్రం లేదన్నారు. హైదరాబాదును దేశానికి రెండో రాజధాని చేయాలనే ఆలోచన కాంగ్రెసు పార్టీకి ఎందుకు రాలేదన్నారు.
నవంబరులో ముందస్తు ఎన్నికలకు వెళ్దామని నిర్ణయించుకున్నాక కాంగ్రెసు పార్టీ తెలంగాణపై హడావుడి చేసిందని మరో నేత నన్నపనేని రాజకుమారి అన్నారు. ఇప్పటికీ కాంగ్రెసు, ఇతర పార్టీలు తెలుగుదేశం పార్టీ పైనే అబాండాలు వేస్తున్నాయన్నారు. తెలంగాణ విషయంలో తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు తాము ఇప్పటి వరకు మౌనం వహిస్తూ వచ్చామన్నారు.
ముందస్తుకు వెళ్లే ఉద్దేశ్యంలో భాగంగానే వారు రాష్ట్రాన్ని విభజించారన్నారు. ఎవరినీ రెచ్చగొట్టాలనే ఉద్దేశ్యం తమకు లేదన్నారు. తెలంగాణను అడ్డుకోవాలని తమకు లేదని అయితే, సీమాంధ్రకు మాత్రం అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. తమ ప్రాంతానికి అన్యాయం జరిగితే ప్రాణాలు అర్పించేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు.












Click it and Unblock the Notifications