రాజీనామాలు స్టార్ట్: గంటా, ఎస్పీవై, మంత్రుల్లో విభేదాలు
మరోవైపు రాజీనామాల విషయంలో సీమాంధ్ర మంత్రులలో విభేదాలు కనిపిస్తున్నాయి. కొందరు రాజీనామాకు సిద్ధపడితే, మరికొందరు రాజీనామాలు పరిష్కారం కాదని చెబుతున్నారు. పార్టీ అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున తమ ప్రాంతానికి ఏం కావాలో డిమాండ్ చేసే అంశాన్ని పరిశీలిస్తే బాగుంటుందని చెబుతున్నారు.
మంత్రి బాలరాజు నివాసంలో వేరుగా ఐదుగురు మంత్రులు భేటీ అయ్యారు. బాలరాజు, పితాని సత్యనారాయణ, పార్థసారథి, అహ్మదుల్లా, తోట నరసింహంలు సమావేశమయ్యారు. రాజీనామాలు చేస్తే ఫలితం లేదని వారు అభిప్రాయపడుతున్నట్లుగా తెలుస్తోంది.
కిరణ్ విజ్ఞప్తి
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని అయితే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం చర్యలు తప్పవని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీల విగ్రహాలకు భద్రత పెంచాలని ఆదేశించారు. సీమాంధ్రలో వెల్లువెత్తుతున్న నిరసనల నేపథ్యంలో డిజిపి దినేష్ రెడ్డి సిఎస్తో భేటీ అయ్యారు.