అవినీతి పార్టీకి తిరస్కరణ: జగన్ పార్టీపై టిడిపి హరికృష్ణ

Nandamuri Harikrishna
హైదరాబాద్: మూడు దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలను విశ్లేషిస్తే ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారని అర్థమవుతోందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ గురువారం అన్నారు. అదే సమయంలో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన విమర్శలు చేశారు.

మూడు దశల్లో ప్రజలు టిడిపికి అత్యధిక స్థానాలను కట్టబెట్టినందుకు ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల సరళిని చూస్తుంటే ప్రజలు తమ పార్టీ వైపు ఉన్నాలని ఎవరికైనా అర్థమవుతుందన్నారు. కాంగ్రెసు అధికార దుర్వినియోగం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అవినీతిని ఈ ఎన్నికలలో ప్రజలు తిరస్కరించారన్నారు.

నందమూరి హరికృష్ణ ఇటీవల పలు పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైన సమయంలోను స్పందించారు. పంచాయతీ ఎన్నికలలో అత్యధిక స్థానాలలో తమ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలహరికృష్ణ పదిహేను రోజుల క్రితం అన్నారు.

కాగా ఏకగ్రీవాలు, మూడు దశల పంచాయతీ ఎన్నికల ఫలితాలు కలిపి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మద్దతుదారులు కొద్ది తేడాతో ఆరువేల పంచాయతీల్లో గెలుపొందారు. కాంగ్రెసు ముందంజలో ఉంది. టిడిపి రెండో స్థానంలో ఉంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మూడు వేల ఎనిమిది వందలు, తెలంగాణ రాష్ట్ర సమితి పద్దెనిమిది వందల పంచాయతీలను గెలుచుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+