రబ్బర్ బుల్లెట్స్ వద్దని కిరణ్, లగడపాటికి జగన్పార్టీ సెగ
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులను ధ్వంసం చేయవద్దని ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. జాదీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయవద్దని, సంయమనం పాటించాలని ఆయన ప్రజలను కోరారు.
పితాని ఇంటి వద్ద ఆందోళన
పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి పితాని సత్యనారాయణ ఇంటి వద్ద సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి ఆందోళన చేపట్టింది. పెద్ద సంఖ్యలో వచ్చిన సమైక్యవాదులు రాష్ట్రం విడిపోతే అందరూ నష్టపోతామని నినాదాలు చేశారు. మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బస్సులు బంద్ అయ్యాయి. పాఠశాలలు, కళాశాలలు బంద్ అయ్యాయి. విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అయింది. చిత్తూరు జిల్లా తిరుపతిలో టిటిడి పరిపాలన భవనాన్ని ముట్టడించారు. పలు ప్రాంతాల్లో కాంగ్రెసు పార్టీ నేతల విగ్రహానికి నల్లబట్టను కప్పి ఉంచారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఇంటిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ముట్టడించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.