దోపిడీ ఆగుతుందనే: జగన్పై కొండా సురేఖ మరోసారి

ఆత్మాభిమానాన్ని కాపాడుకునేందుకు తెలంగాణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శ్రేణులు ఆ పార్టీని వీడాలని ఆమె పిలుపునిచ్చారు. వైయస్ పలుమార్లు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారన్నారు. తెలంగాణకు అనుకూలంగా ఇడుపులపాయ సాక్షిగా చేసిన తీర్మానం, జగన్ జైలులో తమకిచ్చిన హామీలేవీ నెరవేరలేదని తెలిపారు. తెలంగాణకు తెలుగుదేశం పార్టీ బ్లాంక్ చెక్కు ఇచ్చిందని ఆరోపిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రం చెల్లని చెక్కు ఇచ్చిందని విమర్శించారు.
సీమాంధ్రలో పార్టీని బలోపేతం చేసుకునే ఏకైక లక్ష్యంతోనే పార్టీ అధిష్ఠానం ఇలా వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు అడ్డుకారాదనే తాము బయటకు వచ్చామన్నారు. తాము ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయించుకోలేదని, సీమాంధ్రలో జరుగుతున్న సమైఖ్య ఉద్యమం సమసిపోయాక సమష్టిగా నిర్ణయం తీసుకుంటామన్నారు.
రాజకీయ అవసరాల కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఇన్నాళ్లు కడుపులో కత్తులు పెట్టుకొని తెలంగాణ ప్రాంత నాయకులను కౌగిలించుకున్నారని కెకె మహేందర్ రెడ్డి విమర్శించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పార్టీ అధిష్ఠానం సీమాంధ్ర ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించడంతో ఆ విష కౌగిలి నుంచి బయటపడ్డామన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనవద్దని తమను నియంత్రించిన అధిష్ఠానం.. సమైక్యాంధ్ర ఉద్యమంలో అక్కడి నేతలు పాల్గొంటున్నా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications