సంస్కారం కోల్పోను: కెసిఆర్పై రాములమ్మ, టిడిపి ఫైర్
మానవత్వం లేదా?: సోమిరెడ్డి
సీమాంధ్రలో సమైక్య రాష్ట్రం కోసం బలిదానాలు జరుగుతుంటే కెసిఆర్ కుటుంబానికి మానవత్వం లేదా అని తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేరుగా ప్రశ్నించారు. సీమాంధ్ర ఉద్యమానికి తమ పార్టీ డబ్బులిచ్చారని తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు అనడం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమానికి మీరెంత ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ తమ చేతుల్లోకి రావాలనేదే కెసిఆర్ కుటుంబ సభ్యుల ఆలోచన అన్నారు.
డబ్బులతో సీమాంధ్ర ఉద్యమం నడవడం లేదన్నారు. సీమాంధ్రుల హక్కుల కోసం ఎవరూ మాట్లాడటం లేదన్నారు. నిధుల గురించి మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్ర యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయో చెప్పాలని సోమిరెడ్డి ప్రశ్నించారు. తమ ప్రాంత యువతకు ఎలా న్యాయం చేస్తారో కాంగ్రెసు పార్టీ వివరణ ఇవ్వాలని లేదంటే ఆ పార్టీ అంతు చూస్తామన్నారు.
హైదరాబాదుతో సీమాంధ్రులకు సంబంధం లేదని ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ ప్రకటన చేయడం సరికాదన్నారు. సీమాంధ్రులకు ఎలాంటి అన్యాయం జరగని రీతిలో కేంద్ర ప్రభుత్వంతో ప్రకటన చేయించాలన్నారు. కాంగ్రెసు పార్టీది ఓటు బ్యాంకు రాజకీయమన్నారు.