విజయమ్మ ఇంటి ముట్టడి, అంచనా వేయలేదని మంత్రి
చిత్తూరులో ఎమ్మెల్యే సికె బాబు నిరసన దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. తిరుపతిలో కేబుల్ ఆపరేటర్లు ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. వారికి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మద్దతు తెలిపారు. విశాలాంధ్ర నేత పరకాల ప్రభాకర్ బస్సుయాత్రను ప్రారంభించారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో వైయస్సార్ కాంగ్రెసు స్కూటర్ ర్యాలీని నిర్వహించింది.
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో మురళీ మోహన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. శ్రీకాళహస్తిలరో ఎపిఎన్జీవోలు స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళంలో డ్రైవర్లు, ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళనలో పాల్గొన్నారు.
ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, సోనియా దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. పాలకొల్లు, నర్సీపట్నం, తణుకులలో బ్రాహ్మణ సమాక్య శాంతియాగాలు నిర్వహించారు. తుంగభద్ర చెక్ పోస్టు వద్ద కర్నూలులో జర్నలిస్టులు క్రికెట్ ఆడారు. కాణిపాకంలో అర్చకులు ర్యాలీ నిర్వహించారు. సమైక్యాదులు పలుచోట్ల వాహనాలను, బస్సులను నిలిపివేశారు.
అంచనా వేయలేకపోయారు: శైలజానాథ్
సమైక్యాంధ్ర ఉద్యమం ఇంత ఉధృతంగా ఉంటుందని అధిష్టానం అంచనా వేయలేకపోయిందని మంత్రి శైలజానాథ్ అన్నారు. మంత్రులు శైలజానాథ్, గంటా శ్రీనివాస రావు, కొండ్రు మురళిలో క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనపై చర్చించారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడారు.
విభజన విషయమై సిఎం, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలకు కూడా సమాచారం లేదని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా అధిష్టానం నిర్ణయం తీసుకోదని భావించామని, ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న నేపథ్యంలో అధిష్టానం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని భావిస్తున్నామన్నారు. మంత్రులను, ఎంపీలను రంగంలోకి దింపడమే తమ ఢిల్లీ పర్యటన లక్ష్యమన్నారు.