పాల్వాయికి సోనియా మందలింపు, పల్లంరాజు నిలదీత!

కార్యకలాపాలకు అంతరాయం కల్పించని రీతిలో నిరసనలకు మాత్రమే సోనియా అనుమతిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఎంపీలు వెల్లోకి వెళ్తుంటే సోనియా సంజ్ఞ చేసి ఆపారు. ఆ తర్వాత పార్టీకే చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎంపి సబ్బం హరిని సైతం ఆమె చేయిపట్టుకుని నిలువరించారు. సీమాంధ్ర ఎంపీల భేటీకి ఆమె రేణుకా చౌదరిని పంపించి సీట్ల వద్దే ఉండి నిరసన తెలపమని సూచించారు.
ఇక మంగళవారం సోనియాను కలిసి వచ్చిన అనంతరం కేంద్ర మంత్రి పళ్లంరాజు.. ఆంటోనీ కమిటీ నేపథ్యంలో విభజన ప్రక్రియ ఆగిపోతుందనే అర్థం వచ్చేలా చేసిన ప్రకటన పైనా సోనియా అసంతృప్తి వ్యక్తం చేశారట. దీనిపై ఒక ఆంగ్లపత్రికలో వచ్చిన వార్త క్లిప్పింగ్ను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్, రాజయ్య, అంజన్ కుమార్, గుత్తా సుఖేందర్ రెడ్డిలు అధినేత్రికి చూపించారు. దీంతో పల్లం రాజు వివరణ ఇచ్చుకున్నారట.
ఇక పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తమను హైదరాబాద్ నుంచి వెళ్లి పొమ్మని చెప్పారంటూ సీమాంధ్ర మంత్రులు ఫిర్యాదు చేశారు. సోనియా పాల్వాయికి ఫోన్ చేసి మందలించినట్లుగా సమాచారం. అసలే సీమాంధ్ర నేతలు ఆందోళన చెందుతున్నారని,ఇలాంటప్పుడు మీరు వివాదాస్పద ప్రకటనలు చేయకూడదని సూచించారట. దీంతో పాల్వాయి టిడిపి సభ్యుడు సుజనా చౌదరి వద్దకు వెళ్లి క్షమాపణ చెప్పారు.












Click it and Unblock the Notifications