విశ్వరూప్ సంచలన వ్యాఖ్యలు, గజల్ శ్రీనివాస్కు షాక్
తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చినంత మాత్రాన తెలంగాణపై సిడబ్ల్యూసి తీర్మానం సరికాదన్నారు. తీర్మానానికి ముందే ఆంటోని కమిటీ వేయాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వపరమైన కమిటీ వేస్తే ఇంకా బాగుండేదన్నారు. కమిటీ సభ్యులు ఎసి గదుల్లో కూర్చుంటే సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలు తీసుకోలేరని, ఆంటోని కమిటీ సీమాంధ్రలో పర్యటించాలని విశ్వరూప్ డిమాండ్ చేశారు.
ఈటెల మండిపాటు
సద్భావన యాత్రలు, శాంతి ర్యాలీలకు అనుమతివ్వని ప్రభుత్వం సీమాంధ్ర నేతలను ప్రభుత్వ కార్యాలయాలకు ఎలా అనుమతిస్తోందని తెరాస శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. ఇలాగే ఉంటే రేపటి నుండి తాము కూడా కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుందన్నారు.
భీమా భవన్, విద్యుత్ సౌధలో ఉద్రిక్తం
జలసౌధలు తెలంగాణ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పార్లమెంటులో వెంటనే బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. విద్యుత్ సౌధ, భీమా భవన్లలోను ఉద్రిక్తత తలెత్తింది. సీమాంధ్ర ఉద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత తులసీ రెడ్డి, ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్, ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ కుమార్లను తెలంగాణ ఉద్యోగులు అడ్డుకున్నారు. ఇరువర్గాలు పోటా పోటీగా నినాదాలు చేసుకున్నాయి.