హరీ! పార్టీతో తేల్చుకో, వారిది సోనియా భజన: సిపిఎం
విభజన విషయంలో సీమాంధ్ర కేంద్రమంత్రులు తమ పార్టీతో పోరాడాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెసు పార్టీల నిర్ణయాలు మారేలు ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సీమాంధ్రలో కొంతమంది ముఖ్యమంత్రి కావడం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని ఆరోపించారు.
ఉద్యమ తీవ్రత సీమాంధ్రలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ లేఖ కాంగ్రెసు పార్టీ నాటకంలో భాగమన్నారు. ఆంటోని కమిటీ కాంగ్రెసు పార్టీ కమిటీ అని, ప్రభుత్వ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు విభజన విషయంలో డ్రామాలు ఆడుతున్నాయన్నారు. రాజీనామాల వల్ల ఎలాంటి లాభం ఉండదని చెప్పారు.
ఉపాధ్యాయులు, కార్మికులు సమ్మె విరమించాలని రాఘవులు కోరారు. రాజకీయ పార్టీలు మోసాలు వీడి స్పష్టమైన విధానంతో ఉండాలని కోరారు. కేంద్రమంత్రులు పదవులు వదులుకోకుండా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ భజనను మానరని ఎద్దేవా చేశారు.