వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసుకు ఝలక్: జగన్ పార్టీలో చేరిన కేతిరెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Ketireddy Venakatarami Reddy
హైదరాబాద్: అనంతపురంలో కాంగ్రెసు పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెసు తీరును వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లా ధర్మవరం శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కాంగ్రెసు పార్టీకి, శానససభా సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.

పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో ఆయన సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. కండువా కప్పి ఆయనను విజయమ్మ పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు కాటసాని రాంరెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెసు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దాన్ని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీమాంధ్రలో ఆందోళనలకు దిగింది. సమైక్య నినాదాన్ని అందుకుని ఆందోళనలు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో సీమాంధ్రలోని పలువురు నాయకులు వైయస్సార్ కాంగ్రెసులో చేరడానికి సిద్ధపడ్డారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన తమ్మినేని సీతారాం కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర విభజనపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న వైఖరిని సీతారాం తీవ్రంగా తప్పు పట్టారు. చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

English summary
MLA from Dharamavaram in Ananthapur district Ketireddy Venakatarami reddy has resigned from Congress and joined in YS Jagan's YSR Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X