టిపై పిటిషన్ కొట్టేసిన సుప్రీం, తెలుగులో మాట్లాడిన జడ్జి

SC quashes petition on AP division
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌ను కోర్టు సోమవారం కొట్టివేసింది. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ మాత్రమే నిర్ణయం తీసుకుందని, రాష్ట్ర ఏర్పాటు ఏమీ మొదలు కాకుండానే పిటిషన్ ఎలా వేస్తారని పిటిషనర్‌ను కోర్టు ప్రశ్నించింది.

కేంద్రం తెలంగాణపై ఇంకా బిల్లు పెట్టనందున పిటిషన్ విచారణకు అర్హమైనది కాదని పేర్కొన్నారు. విభజన ప్రక్రియ మొదలు కాకుండా ఎలా పిటిషన్ విచారిస్తామని ప్రశ్నించింది. రాష్ట్ర ఏర్పాటుకు, ప్రకటనకు మధ్య చాలా అంశాలు ఉంటాయని పేర్కొంది. రాష్ట్రాన్ని విభజించే అధికారం కేంద్రానికి లేదని పిటిషనర్ చెప్పగా, కోర్టు మాత్రం అధికారముందని చెప్పింది.

కాగా, విభజనపై న్యాయవాది పిపి కృష్ణయ్య ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విభజన ప్రక్రియ సరికాదని ఆయన కోర్టును ఆశ్రయించారు. విభజనపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేయనందున పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది. కాగా, న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు ఓ సమయంలో తెలుగులో మాట్లాడారు.

మరోవైపు, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో విభజనపై దాఖలైన పిటిషన్‌ను కూడా న్యాయస్థానం కొట్టి వేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+