వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభలో టిడిపి ఎంపీల సస్పెన్షన్, దాడిపై లగడపాటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

sujana choudhary and cm ramesh
న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలు కాపాడాలంటూ రాజ్యసభలో ఆందోళన చేపడుతున్న ఇద్దరు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులను డిప్యూటీ చైర్మన్ కురియన్ సభ నుంచి సోమవారం సస్పెండ్ చేశారు. ఎంపీలు సిఎం రమేష్, సుజనా చౌదరిలు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి తమ ప్రాంత ప్రయోజనాలు కాపాడాలంటూ సభలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఈ రోజు కూడా వారు సభలో నిరసన చేపట్టారు. సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడాలంటూ నినాదాలు చేశారు. సభ సాగేందుకు సహకరించాలని డిప్యూటీ చైర్మన్ కోరినా వారు తగ్గలేదు. దీంతో వారిని ఆర్టికల్ 255 ప్రకారం ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. అనంతరం సభను అరగంట వాయిదా వేశారు. వారు సభలోనే ఉండి నిరసన తెలిపారు.

ఎక్కడ దాడి జరిగింది?: లగడపాటి

విభజన జరగకముందే తెలంగాణవాదులు రౌడీల్లా సీమాంధ్ర ఉద్యోగులపై దాడులు చేస్తున్నారని, సీమాంధ్రలో తెలంగాణ వారిపై దాడులు జరిగాయని చెబుతున్న వారు ఎక్కడ జరిగాయో చెప్పాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ డిమాండ్ చేశారు.

విభజన ప్రక్రియ నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణవాదులు రౌడీల్లా సీమాంధ్ర ఉద్యోగులపై దాడులు చేయడం గర్హనీయమన్నారు. తమ ప్రాంత ఉద్యోగాలు శాంతియుతంగా సమావేశాలు నిర్వహించుకుంటే దాడులు చేయడమేమిటన్నారు. రక్షణ కల్పిస్తామన్న నేతలు ఎక్కడకు వెళ్లారన్నారు. ప్రజలను దోచుకునేందుకే వేర్పాటు ఉద్యమం జరుగుతోందన్నారు. సీమాంధ్రలో ప్రజా ఉద్యమం జరుగుతోందని చెప్పారు. సమైక్యాంధ్ర కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు.

English summary
Daily disruptions since Parliament's monsoon session began on August 5 finally led to the suspension of Two Telugudesam MPs in Rajya Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X