వంజర రాజీనామా: నరేంద్ర మోడీ, అమిత్ షాలపై ఫైర్
రాష్ట్ర పోలీసులకు రక్షణ లేకుండా పోయిందని ఆ లేఖలో అంటూ మోడీ, అమిత్ షాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. నకిలీ ఎన్ కౌంటర్ కేసులో తన పేరు ఉండటం పట్ల తాను ఆశ్చర్యానికి గురైనట్లు తెలిపారు. అమిత్ షా రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారని ఆరోపించారు.
తమను రక్షించుకోవడానికి నరేంద్రమోడీ, అమిత్ షా పోలీసు అధికారులను బలిచేస్తున్నారని విమర్శించారుఇష్రత్ జహాన్, సొహ్రాబుద్దీన్ పాకిస్థాన్ ప్రేరేపిత తీవ్రవాదులని, వారు నరేంద్రమోడీ, మరి కొందరు నేతల హత్యకు కుట్ర పన్నినట్లు తెలిపారు.
ఇది ఇలా ఉండగా, నకిలీ ఎన్ కౌంటర్ విచారణ జరుగుతుండగా నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి పదవిలో ఎలా కొనసాగుతారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ మీడియా సమావేశంలో ప్రశ్నించారు. కాంగ్రెస్ నరేంద్ర మోడీ రాజీనామా తప్ప మరేమి అడగడం లేదని, కానీ గుజరాత్ ప్రజలు మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ ను తిరస్కరించి నరేంద్ర మోడీకి పట్టం కట్టారని భారతీయ జనతా పార్టీ ఎంపీ బల్బీర్ పుంజ్ అన్నారు.