చంద్రబాబును అడ్డుకున్న జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్
చంద్రబాబు నాయుడు సోమవారం కృష్ణా జిల్లాలోని రెడ్డిగూడెం మండలం మెట్టగూడెం గ్రామం చేరుకున్నారు. అక్కడ ఉన్న ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాలని అబిమానులు కోరారు. అందుకు చంద్రబాబు నిరాకరించినట్లు చెబుతున్నారు.
విగ్రహాలకు పూలమాల వేస్తూ పోతే సమయం సరిపోదని చంద్రబాబు అన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. చంద్రబాబు వ్యాఖ్యలతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం చెందినట్లు తెలుస్తోంది. దాంతో చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకున్నారని సమాచారం. చంద్రబాబు వెంట ఉన్నవారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను పక్కకు లాగేసినట్లు, దాంతో చంద్రబాబు ముందుకు సాగినట్లు చెబుతున్నారు.
ఇదిలావుంటే, అంతకు ముందు చంద్రబాబునాయుడు వినాయకచవితి సందర్భంగా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెంలో వినాయక పూజలో పాల్గొన్నారు. జిల్లా నియోజకవర్గం ఇన్ చార్జి దేవినేని ఉమా ఉమామహేశ్వర రావు సహా పలువురు పార్టీ నాయకులు పూజల్లో పాల్గొన్నారు.