వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబును అడ్డుకున్న జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్

By Pratap
|
Google Oneindia TeluguNews

Jr NTR fans obstruct Chandrababu
విజయవాడ: కృష్ణా జిల్లాలో తెలుగువాడి ఆత్మగౌరవ యాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైనట్లు వార్తలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసేందుకు సమయం చాలదని చంద్రబాబు చెప్పినట్లు, దాంతో చంద్రబాబును జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అడ్డుకున్నట్లు సోమవారం వార్తలు వచ్చాయి.

చంద్రబాబు నాయుడు సోమవారం కృష్ణా జిల్లాలోని రెడ్డిగూడెం మండలం మెట్టగూడెం గ్రామం చేరుకున్నారు. అక్కడ ఉన్న ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాలని అబిమానులు కోరారు. అందుకు చంద్రబాబు నిరాకరించినట్లు చెబుతున్నారు.

విగ్రహాలకు పూలమాల వేస్తూ పోతే సమయం సరిపోదని చంద్రబాబు అన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. చంద్రబాబు వ్యాఖ్యలతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం చెందినట్లు తెలుస్తోంది. దాంతో చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకున్నారని సమాచారం. చంద్రబాబు వెంట ఉన్నవారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను పక్కకు లాగేసినట్లు, దాంతో చంద్రబాబు ముందుకు సాగినట్లు చెబుతున్నారు.

ఇదిలావుంటే, అంతకు ముందు చంద్రబాబునాయుడు వినాయకచవితి సందర్భంగా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెంలో వినాయక పూజలో పాల్గొన్నారు. జిల్లా నియోజకవర్గం ఇన్ చార్జి దేవినేని ఉమా ఉమామహేశ్వర రావు సహా పలువురు పార్టీ నాయకులు పూజల్లో పాల్గొన్నారు.

English summary
According to media reports - Jr NTR fans obstructed Telugudesam party president Nara Chandrababu Naidu in Krishna district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X