ఏపీలో కొత్తగా 10548 కరోనా కేసులు... మరో 82 మంది మృతి...
ఆంధ్రప్రదేశ్లో కరోనా పంజా కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో కొత్తగా మరో 10548 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 82 మంది మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,14,164కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 3796కి చేరింది.
గత 24గంటల్లో 8976 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ మొత్తం 3,12,687 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 97681 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి.
చిత్తూరులో 15 మంది,నెల్లూరులో 11 మంది,పశ్చిమ గోదావరి,తూర్పు గోదావరి జిల్లాలో 8 చొప్పున,అనంతపురం,గుంటూరు,కర్నూలులో ఆరుగురు చొప్పున,ప్రకాశం,విశాఖపట్నం జిల్లాల్లో ఐదుగురు చొప్పున,శ్రీకాకుళం,విజయనగరం జిల్లాల్లో నలుగురు చొప్పున,కడప,కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. అత్యధికంగా ఇప్పటివరకూ తూర్పుగోదావరి జిల్లాలో 56930 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో 43248 కేసులతో కర్నూలు,39460 కేసులతో అనంతపురం ఉన్నాయి.