Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కారు టైర్ పంక్చర్: బైక్‌ని ఢీకొట్టి లారీ కిందకు దూసుకెళ్లింది, 11 మంది మృతి

విశాఖ: విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నక్కలపల్లి మండలం కాగిత గ్రామం దగ్గర కారు.. ట్రాలరు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు ట్రాలర్ కిందకు దూసుకు వెళ్లింది. విశాఖ నుంచి విజయవాడ వెళ్తుండగా కారు టైర్ పంక్చర్ కావడంతో ఈ ప్రమాదం సంభవించింది.

లారీ - కారు - బైక్ ఢీకొన్న ఈ ఘటనలో 11 మంది మృతిచెందారు. విశాఖ నుంచి తుని వైపు వెళ్తున్న కారు టైరు పేలిపోవడంతో అదుపుతప్పి అవతలి వైపు వెళ్తున్న బైక్‌ను మొదట ఢీకొంది. ఆ తర్వాత బైక్‌ను ఈడ్చకుంటూ వెళ్తూ... ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.

11 killed in road accident near Visakhapatnam

ఈ ఘటనలో కారులోని తొమ్మిది మంది, బైక్ పైన ఉన్న వారిలో ఒకరు మృతి చెందారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయచర్యలు చేపట్టారు. పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. భయానక సంఘటన, రోడ్డుపై ఎక్కడికక్కడ పడివున్న మృతదేహాలను చూసి స్థానికులు చలించిపోయారు. కారు, బైక్‌.. లారీ కిందకు పూర్తిగా వెళ్లిపోవడంతో మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. మృతి చెందిన వారిలో బైక్ పైన వెళ్తున్న ఓ వ్యక్తి కూడా ఉన్నాడు. అతను హెటిరో డ్రగ్స్‌లో పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+